ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో సెమిస్టర్ విధానం అమలు

AP Govt Issued Orders Regarding 2 Semester System in Schools From 2023-24 Academic Year,AP Govt Issued Orders,2 Semester System in Schools,AP 2023-24 Academic Year,Mango News,Mango News Telugu,Legislative Capital Is Amaravati,Sajjala Ramakrishna Reddy,Ap Govt Advisor Sajjala Ramakrishna Reddy,Tdp Chief Chandrababu Naidu,Ap Cm Ys Jagan Mohan Reddy , Ys Jagan News And Live Updates, Ysr Congress Party, Andhra Pradesh News And Updates, Ap Politics, Janasena Party, Tdp Party, Ysrcp, Political News And Latest Updates

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో సెమిస్టర్ విధానం అమలు చేయడానికి సిద్ధమైంది. ఈ మేరకు దీనికి సంబంధించి శనివారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం.. 2023-24 విద్యా సంవత్సరం నుండి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో రెండు సెమిస్టర్ల విధానాన్ని ప్రవేశ పెట్టనున్నారు. ముందుగా 1వ తరగతి నుండి 9వ తరగతి వరకూ రెండు సెమిస్టర్ల విధానాన్ని అమలు చేయనున్నారు. ఇక 2024-2025 విద్యా సంవత్సరం నుండి 10వ తరగతికి కూడా దీనిని వర్తింప చేయనున్నారు. ఈ క్రమంలో విద్యా సంవత్సరం ప్రారంభంలోనే రెండు సెమిస్టర్లకు సరిపడా పుస్తకాలను ‘జగనన్న విద్యా కానుక’ ద్వారా పంపిణీ చేయనున్నారు. కాగా సీఎం జగన్ విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థులకు నాణ్యమైన మరియు సులభతరమైన బోధన కోసం ఈ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ