దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం పూర్తిగా తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో మొత్తం 1,19,475 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 167 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రోజువారి పాజిటివిటీ రేటు 0.14 శాతంగా నమోదవగా, మొత్తం కేసుల సంఖ్య 4,46,75,776 కు చేరుకుంది. అలాగే కరోనా వలన మరో 4 మరణాలు (మహారాష్ట్రలో 1, కేరళలో రికాంసైల్డ్ 3) నమోదు కావడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,30,667కి పెరిగింది.. మరో 246 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 4,41,41,501కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.80 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది.
కాగా ప్రస్తుతం దేశంలో 3,608 (0.01%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా నమోదైన కేసుల్లో కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్ వంటి రాష్ట్రాల్లోనే కేసులు కొంత ఎక్కువుగా నమోదు అయ్యాయి. అయితే ఏ రాష్ట్రంలో కూడా 100 పైన కరోనా కేసులు నమోదవలేదు. అలాగే గత 24 గంటల్లో 23 రాష్ట్రాల్లో జీరో కేసులు నమోదయ్యాయి.
గత 24 గంటల్లో కరోనాకేసులు ఎక్కువగా నమోదైన 5 రాష్ట్రాలివే (డిసెంబర్ 16 (8am)–డిసెంబర్ 17 (8am)):
- కేరళ – 63
- మహారాష్ట్ర – 32
- కర్ణాటక – 14
- రాజస్థాన్ – 14
- ఢిల్లీ, వెస్ట్ బెంగాల్ – 9.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE