ఏపీ లోని ప్రతి నియోజకవర్గంలో ఒక జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్ లే అవుట్‌ ఏర్పాటు చేయాలి – సీఎం జగన్‌

CM YS Jagan Held Review on Departments of AP Municipal and Urban Development Today, Jagan Review on AP Municipal Departments, Jagan Review on Urban Development Department, AP Municipal and Urban Development, Mango News,Mango News Telugu, Jagananna Smart Township Layout, Jagananna Smart Township Scheme, Jagananna Smart Township In Every Constituency, AP CM YS Jagan Mohan Reddy, YS Jagan Latest News And Updates, AP CM YS Jagan, Jagananna Smart Township, CM YS Jagan Mohan

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి నియోజకవర్గంలో ఒక ‘జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్ లే అవుట్‌’ ఏర్పాటు చేయాలని ఆదేశించారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి. శుక్రవారం ఆయన ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు ఆయన అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. ఇక తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ సమీర్ శర్మ, స్పెషల్ సీఎస్ శ్రీలక్ష్మి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్, ఏపీ టిడ్కో ఎండీ శ్రీధర్ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.

సీఎం జగన్‌ కీలక ఆదేశాలు..

  • వర్షాల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించాలి.
  • దెబ్బతిన్న రోడ్లను గుర్తించి వచ్చే ఏడాది మార్చి 31 నాటికి మరమ్మతులు పూర్తి చేయాలి.
  • అలాగే ప్రతీ మున్సిపాలిటీ పరిధిలో వేస్ట్ ప్రాసెసింగ్ ప్రక్రియ అమలవుతున్న తీరుని నిరంతరం పర్యవేక్షించాలి.
  • కృష్ణా నది వరద ముంపుని నివారించడానికి యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేసిన రిటైనింగ్ వాల్ నిర్మాణం వద్ద డ్రైనేజీ వాటర్ చేరకుండా చర్యలు చేపట్టాలి.
  • రాష్ట్రంలో ప్లాస్టిక్ బ్యానర్లు, ఫ్లెక్సీలు నిషేధించిన నేపథ్యంలో ఆయా వ్యాపారులను క్లాత్ బ్యానర్ల తయారీకి ప్రోత్సహించేలా జిల్లాల కలెక్టర్లు చొరవ చూపాలి.
  • ఇక జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు, మురుగునీటి శుద్ధి కేంద్రాలు త్వరితగతిన ఏర్పాటు చేయాలి.
  • ప్రతి నియోజకవర్గంలో ఒక జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్ లే అవుట్‌ను ఏర్పాటు చేయాలి.
  • విజయవాడ నుంచి గన్నవరం విమానాశ్రయం వెళ్లే రహదారికి ఇరువైపులా, అంబేడ్కర్ పార్కుకి వెళ్లే రోడ్లతో పాటు విశాఖపట్నంలోని రోడ్ల సుందరీకరణను ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలి.
  • వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ప్రతి ఏటా 45 ఏళ్ళు నిండిన మహిళలకు అందిస్తున్న ఆర్ధిక సాయంతో వారు స్వయం ఉపాధి సృష్టించుకోవడానికి తగిన సలహాలు, సూచనలు అందించాలి.
  • ఈ అంశాలన్నింటిపై జిల్లాల వారీగా ఎప్పటికప్పుడు కలెక్టర్లతో సమీక్షలు చేసి పనుల పురోగతిపై వివరాలు తెలుసుకోవాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY