నల్గొండ జిల్లాలోని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉపఎన్నికకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరును టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మునుగోడు ఉపఎన్నికకు నేడు (అక్టోబర్ 7, శుక్రవారం) నోటిఫికేషన్ జారీ కాగా, నేటి నుంచే నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలయింది. ఈ నేపథ్యంలో శుక్రవారం పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి సీఎం కేసీఆర్ బీఫామ్ ను అందజేశారు.
అలాగే ఎన్నికల ఖర్చు నిమిత్తం పార్టీ నిధి నుంచి రూ.40 లక్షల చెక్కును కూడా అందించారు. ఈ సందర్భంగా తనకు మునుగోడు పార్టీ అభ్యర్థిగా అవకాశమిచ్చినందుకు సీఎం కేసీఆర్ కు ప్రభాకర్ రెడ్డి కృతజ్జతలు తెలిపారు. ప్రగతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, గువ్వల బాలరాజు, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY