తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకునేందుకు బీజేపీ తన కసరత్తును మరింత ముమ్మరం చేసింది. గతంలో జరిగిన దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయాలు సాధించిన బీజేపీ, త్వరలో జరగబోయే మునుగోడు ఉపఎన్నికతో పాటుగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై కూడా ప్రత్యేక దృష్టి సారించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా సహా పలువురు నేతలు ఇప్పటికే పలుమార్లు రాష్ట్రంలో పర్యటించి రాష్ట్ర నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంచార్జ్ లను నియమించారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ ప్రేమేందర్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంచార్జ్ లను నియమించడంతో పార్టీ కార్యకలాపాలు మరింత విస్తృతంగా నిర్వహించే అవకాశం ఉంది.
119 అసెంబ్లీ నియోజకవర్గాలకు బీజేపీ ఇంచార్జ్ లు వీళ్ళే:
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY