ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. కొత్తగా 17188 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మే 7, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 12,45,374 కు చేరింది. కొత్తగా అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 2260, విశాఖపట్నంలో 1868, తూర్పుగోదావరిలో 1823, అనంతపూర్ లో 1779, శ్రీకాకుళంలో 1632, నెల్లూరులో 1530, గుంటూరులో 1515, కర్నూల్ లో 1342 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో మరో 12,749 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయినట్టు తెలిపారు. ఇక కరోనా వలన రాష్ట్రంలో మరో 73 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 8519 కి పెరిగింది. గత 24 గంటల్లో 1,00,424 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా, మొత్తం పరీక్షల సంఖ్య 1,71,60,870 కు చేరుకుంది.
ఏపీలో కరోనా కేసులు వివరాలు (మే 7, ఉదయం 10 గంటల వరకు) :
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 12,45,374
- కొత్తగా నమోదైన కేసులు : 17,188
- కొత్తగా నమోదైన మరణాలు : 73
- డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 10,50,160
- యాక్టీవ్ కేసులు : 1,86,695
- మొత్తం మరణాల సంఖ్య : 8519
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ