దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి నియంత్రణకు పరిస్థితులకు అనుగుణంగా స్థానికంగా ఆంక్షలు విధించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోమ్ శాఖ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా పాజిటివ్ కేసుల పెరుగుదల దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరికొన్ని ఆంక్షలు/పరిమితులను జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలను ప్రభుత్వం ఆదేశించింది.
తెలంగాణ ప్రభుత్వం కొత్తగా జారీ చేసిన ఆంక్షలివే:
- వివాహాలు, సంబంధిత కార్యక్రమాలకు 100 మంది మించకూడదు. భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం సహా అన్ని కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించాలి.
- అంత్యక్రియలు, సంబంధిత కార్యక్రమాలకు 20 మంది మించకూడదు.
- అన్ని సామాజిక/రాజకీయ/ క్రీడా/ వినోద/విద్యా/మతపరమైన/సాంస్కృతిక సమావేశాలు లేదా కార్యక్రమాలపై నిషేధం విధింపు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ