ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా మనీష్ కుమార్ సిన్హా నియామకం

AP Intelligence Chief, Ap Political Live Updates 2019, Ap Political News, AP Political Updates, AP Political Updates 2019, Intelligence Chief Of Andhra Pradesh, Mango News Telugu, Manish Kumar Sinha

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసెంబర్ 4, బుధవారం నాడు పలువురు ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో ముఖ్యంగా కీలకమైన ఇంటెలిజెన్స్ విభాగానికి నూతన చీఫ్ గా 2000 బ్యాచ్‌కి చెందిన ఐపీఎస్‌ అధికారి మనీష్‌కుమార్‌ సిన్హాను నియమించింది. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ అదనపు డీజీగా బాధ్యతల నిర్వహిస్తున్న కుమార్‌ విశ్వజిత్ ను రిలీవ్‌ చేస్తూ సిన్హాకు బాధ్యతలు అప్పగించారు. అలాగే ప్రస్తుతం హోం శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న మహ్మద్‌ హసన్‌ రెజాను జైళ్ల శాఖ డైరెక్టర్‌ జనరల్‌గా నియమించారు. టి.ఎ.త్రిపాఠిని జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగ పరిధిలోని కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌లో సభ్యునిగా నియమించారు. ఇప్పుడు నెల్లూరు ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ఐశ్వర్య రాస్తోగిని డీజీపీ కార్యాలయంలో అడ్మిన్ డివిజన్ ఎఐజిగా నియమించారు. ఆయన స్థానంలో భాస్కర్ భూషణ్‌ను నెల్లూరు ఎస్పీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 4 =