ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 55,251 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 1,171 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. అత్యధికంగా తూర్పుగోదావరిలో 255, చిత్తూరులో 158, కృష్ణాలో 147, నెల్లూరులో 145, ప్రకాశంలో 141, గుంటూరులో 101, పశ్చిమగోదావరిలో 94 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,43,244 కు చేరుకుంది.
ఇక కరోనా వలన మరో 11 మరణాలు చోటుచేసుకున్నాయి. చిత్తూరులో ముగ్గురు, నెల్లూరులో ముగ్గురు, కృష్ణాలో ఇద్దరు, పశ్చిమగోదావరిలో ఒకరు, ప్రకాశంలో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14108 కి పెరిగింది. గత 24 గంటల్లో 1,207 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 20,15,387 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 13,749 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ