అక్టోబర్ 5 కి జగనన్న విద్యా కానుక వాయిదా

Andhra Pradesh, AP Jagananna Vidya Kanuka, AP Jagananna Vidya Kanuka Scheme, Jagananna Vidya Kanuka, Jagananna Vidya Kanuka Scheme, Jagananna Vidya Kanuka Scheme In Ap, Jagananna Vidya Kanuka Scheme Postponed, Vidya Kanuka Scheme In Ap

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులకు కోసం “జగనన్న విద్యా కానుక” పేరుతో కొత్త పథకానికి ఏపీ ప్రభుత్వం రూపకల్పన చేసిన సంగతి తెలిసిందే. 2020–21 విద్యా సంవత్సరం నుంచే 1 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు 7 రకాల వస్తువులతో కూడిన కిట్ ను విద్యాకానుక కింద అందించాలని నిర్ణయించారు. ముందుగా సెప్టెంబర్ 5 న పాఠశాలలు ప్రారంభించాలని నిర్ణయించిన నేపథ్యంలో అదేరోజున విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్ అందించేలా ఏర్పాట్లు చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇటీవల జారీచేసిన అన్ లాక్-4 మార్గదర్శకాలలో ప్రస్తుత కరోనా పరిస్థితుల దృష్ట్యా సెప్టెంబరు 30 వరకు పాఠశాలలు తెరవకూడదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జగనన్న విద్యాకానుక కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఏపీ పాఠశాల విద్య సంచాలకులు వాడ్రేవు చినవీరభద్రుడు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని అక్టోబరు 5 వ తేదికి వాయిదా వేసినట్టుగా ప్రకటించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here