విజయవాడ నగరంలో కనకదుర్గ ఫ్లైఓవర్ను సెప్టెంబర్ 18, శుక్రవారం నాడు ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ సంయుక్తంగా నిర్వహించనున్నారు. ఆ సమయంలో పార్లమెంట్ సమావేశాలు ఉన్నందున నితిన్ గడ్కరీ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. రూ.502 కోట్ల వ్యయంతో అబ్బురపరిచేలా నిర్మించిన ఈ ఫ్లైఓవర్ ప్రారంభం కోసం విజయవాడ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముందుగా సెప్టెంబర్ 4 నే ఈ ఫ్లైఓవర్ ప్రారంభించాల్సి ఉంది. భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వారం రోజుల పాటుగా సంతాప దినాలు ప్రకటించడంతో, ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమం వాయిదా పడింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu