అనుక్షణం ప్రజాశ్రేయస్సు, రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా పరిపాలన అందిస్తా: సీఎం జగన్

Andhra Pradesh, Andhra Pradesh CM, AP CM YS Jagan Tweets, AP CM YS Jagan Tweets over Completion of Two Year Rule, AP CM YS Jagan Tweets over Completion of Two Year Rule as Chief Minister, Documents Marking Two Years Of YSRCP Governance, Mango News, YS Jagan Mohan Reddy, YS Jagan Mohan Reddy Latest News, YS Jagan Tweets over Completion of Two Year Rule as Chief Minister, YS Jagan’s two-year rule trends, YS Jagan’s two-year rule trends on twitter

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనకు నేటితో రెండేళ్లు పూర్తయింది. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవడంతో పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. “దేవుని దయ, ప్రజల దీవెనలతో ఈ రెండేళ్ల కాలంలో మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను, ప్రజలకు ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా నెరవేరుస్తూ వచ్చాం. ప్రజలకు నేరుగా రూ.95,528 కోట్లు, ఇతర పథకాల ద్వారా మరో రూ.36,197 కోట్లు మొత్తంగా రూ.1.31 లక్షల కోట్లు అందించగలిగాం. ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందన్న భరోసా ఇవ్వగలిగాం. ఇంకా మంచి చేయడానికి మీ బిడ్డగా, మీ ముఖ్యమంత్రిగా, మీ కుటుంబ సభ్యుడిగా మరింత తాపత్రయ పడతాను. మీరిచ్చిన ఈ అధికారంతో అనుక్షణం ప్రజాశ్రేయస్సు, రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా పరిపాలన అందిస్తానని మరోసారి స్పష్టం చేస్తున్నాను” అని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + seventeen =