యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించేందుకు కాకతీయ యూనివర్సిటీ సిద్ధమైంది. ఈ మేరకు బీ.కామ్, బీఏ(ఎల్), బీఎస్సీ, బీబీఏ, బీసీఏ ఆరో సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ను శుక్రవారం నాడు కాకతీయ యూనివర్సిటీ విడుదల చేసింది. సెప్టెంబర్ 16వ తేదీ నుండి అక్టోబర్ 19వ తేదీ వరకు విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే ఈ పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు జరగనున్నాయి. అధికారిక వెబ్ సైట్ https://www.kakatiya.ac.in/ లో ఎగ్జామినేషన్స్ విభాగంలో నోటిఫికెషన్స్/టైం టేబుల్స్ సెక్షన్ లో పరీక్షల పూర్తి షెడ్యూల్ వివరాలను అందుబాటులో ఉంచారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. విద్యార్థులు తప్పనిసరిగా ఫేస్ మాస్కులు ధరించాలి. పరీక్ష కేంద్రాల వద్ద ధర్మల్ స్కానింగ్, శానిటైజేషన్ ఏర్పాట్లు చేయనున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu