ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూలై 22, బుధవారం ఉదయం 9 గంటల నుంచి జూలై 23, గురువారం ఉదయం 9 గంటల వరకు 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 58,052 శాంపిల్స్ (విఆర్డీఎల్+ట్రూనాట్+నాకో(32434), ర్యాపిడ్ యాంటిజెన్ -25618) ను పరీక్షించారు. అలాగే రాష్ట్రంలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 14,93,879 కు చేరుకుంది. ముఖ్యంగా కరోనా వైద్య పరీక్షల విషయంలో ఏపీ ప్రభుత్వం మొదటి నుంచి ప్రత్యేక దృష్టి పెట్టింది. అధిక సంఖ్యలో పరీక్షలు నిర్వహించి, పాజిటివ్ గా తేలిన బాధితులకు త్వరితగతిన వైద్యం అందించేలా ఏర్పాట్లు చేశారు.
ఈ నేపథ్యంలో జూలై 23 నాటికీ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 72711 కు చేరుకోగా, 37555 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లోనే మరో 5428 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో మరియు కోవిడ్ కేర్ సెంటర్స్ లో మొత్తం 34272 మంది చికిత్స పొందుతున్నారు. ఇక కరోనా మరణాల సంఖ్య 884 కి చేరుకుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu