దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 39,726 కరోనా పాజిటివ్ కేసులు, 154 మరణాలు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,15,14,331 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,59,370 కి పెరిగింది. ముఖ్యంగా మహారాష్ట్ర, పంజాబ్, కేరళ, కర్ణాటక, గుజరాత్, ఛత్తీస్ ఘడ్ వంటి 6 రాష్ట్రాల్లో గత 24 గంటల్లో కొత్త కేసులు పెద్ద సంఖ్యలో నమోదు అయ్యాయి. కరోనా కేసులు భారీగా పెరగడంతో దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 2,71,282 (2.36%) కు చేరుకుంది. మరో 20,654 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 1,10,83,679 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 96.26 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.38 శాతంగా నమోదైంది.
గత 24 గంటల్లో 16 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా మరణాలు లేవు:
కాగా గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్, చండీగర్, ఒడిశా, ఉత్తరాఖండ్, జార్ఖండ్, లక్షద్వీప్, సిక్కిం, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, లద్దాఖ్, మణిపూర్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, అండమాన్ అండ్ నికోబార్, దాద్రా మరియు నగర్ హవేలి మరియు డామన్ మరియు డయ్యు వంటి 16 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎటువంటి కరోనా మరణాలు సంభవించలేదు.
దేశంలో కరోనా కేసులు వివరాలు (మార్చి 19, ఉదయం 8 గంటల వరకు):
- దేశంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య: 23,13,70,546
- మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 1,15,14,331
- కొత్తగా నమోదైన కేసులు [మార్చి 18–మార్చి 19 (8AM-8AM)] : 39,726
- నమోదైన మరణాలు : 154
- రికవరీ అయిన వారి సంఖ్య : 1,10,83,679
- యాక్టీవ్ కేసులు : 2,71,282
- మొత్తం మరణాల సంఖ్య : 1,59,370
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ