దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 82 లక్షలు దాటింది. కొత్తగా 45231 పాజిటివ్ కేసులు నమోదు కాగా నవంబర్ 2, సోమవారం ఉదయానికి మొత్తం కేసుల సంఖ్య 82,29,313 కు చేరుకుంది. అలాగే కరోనాతో మరో 496 మంది మరణించడంతో మరణాల సంఖ్య 1,22,607 కి పెరిగింది. మరోవైపు ఇటీవల కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది. గత 24 గంటల్లో 53,235 మంది కరోనా బాధితులు కోలుకోవడంతో రికవరీ అయిన వారి సంఖ్య 75,44,798 కు చేరుకుంది.
ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 91.68 శాతం గానూ, మరణాల రేటు 1.49 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో మరియు హోమ్ ఐసొలేషన్స్ లో 5,61,908 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. భారత్ ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదైన దేశాల్లో రెండో స్థానంలో, కరోనా మరణాలు ఎక్కువగా నమోదైన దేశాల్లో మూడో స్థానంలో కొనసాగుతుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ