కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా ‘వ్యాక్సిన్ మైత్రి’ పేరిట భారత్ పలు దేశాలకు కరోనా వ్యాక్సిన్లలను సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా జమైకాకు కూడా భారత్ కరోనా వ్యాక్సిన్లను పంపించింది. ఈ నేపథ్యంలో జమైకాకు కరోనా వ్యాక్సిన్లు అందించి సహాయం చేసినందుకు వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. భారత ప్రజలకు మరియు భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాడు. క్రిస్ గేల్ మాట్లాడిన వీడియోను జమైకాలోని భారత హై కమిషన్ ట్విట్టర్ లో షేర్ చేసింది. అలాగే జమైకాలోని భారత హై కమిషనర్ ఆర్.మసాకుయ్ను క్రిస్ గేల్ కలిసి కృతజ్ఞతలు తెలిపాడు. మరోవైపు క్రిస్ గేల్ త్వరలో భారత్ లో జరిగే ఐపీఎల్-2021 లో పాల్గొననున్నాడు. క్రిస్ గేల్ తో పాటుగా వెస్ట్ విండీస్ క్రికెట్ దిగ్గజం వివ్ రిచర్డ్స్, ఆండ్రూ రస్సెల్ సహా పలువురు ఆటగాళ్లు కరోనా వ్యాక్సిన్ పంపిణీపై భారత్ కు ధన్యవాదాలు తెలిపారు.
Legendary Jamaican & WI Cricketer @henrygayle thanks PM @narendramodi, the People and Government of #India for the gift of #MadeInIndia Vaccine to #Jamaica#VaccineMaitri @PMOIndia @DrSJaishankar @MEAIndia @IndianDiplomacy pic.twitter.com/fLBbhF5zTY
— India in Jamaica (@hcikingston) March 19, 2021
The Universe Boss!@henrygayle called on High Commissioner Shri R. Masakui at @hcikingston today.
He thanked #India for gifting the #COVID19 Vaccines to #Jamaica and shared how much he loves being in India.@hcikingston wishes Chris Gayle all the very best for @IPL 2021. pic.twitter.com/mTdleh6lxi
— India in Jamaica (@hcikingston) March 18, 2021
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ