భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నవంబర్ 7, శనివారం మధ్యాహ్నం 3.12 గంటలకి పీఎస్ఎల్వీ-సీ49 రాకెట్ ను ప్రయోగించింది. ఏపీలోని నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి పీఎస్ఎల్వీ-సీ49 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈఓఎస్-1)తో పాటు విదేశాలకు చెందిన మరో 9 కస్టమర్ శాటిలైట్లను పీఎస్ఎల్వీ-సీ49 రాకెట్ మోసుకెళ్లింది. ఈఓఎస్-1 అనే శాటిలైట్ ద్వారా వ్యవసాయం, అటవీ మరియు విపత్తు నిర్వహణ సహాయ సమాచారాన్ని సేకరించనున్నారు. కాగా పీఎస్ఎల్వీ-సీ49 ప్రయోగం అనంతరం ఈఓఎస్-1 శాటిలైట్, 9 కస్టమర్ శాటిలైట్లు కూడా నిర్దేశించిన కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టబడ్డాయని ఇస్రో ప్రకటించింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ