మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జా వ్యవహారంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు మరో ఫిర్యాదు అందింది. ఈటల రాజేందర్ కుమారుడు ఈటల నితిన్ రెడ్డి తన భూమి కబ్జా చేశారని, తనకు న్యాయం చేయాలని కోరుతూ, మేడ్చల్ జిల్లా, మేడ్చల్ మండలం, రావల్ కోల్ గ్రామ నివాసి పీట్ల మహేష్ ముదిరాజ్ అనే వ్యక్తి సీఎంకు ఫిర్యాదుతో కూడిన దరఖాస్తు చేశారు. దీంతో తనకందిన ఫిర్యాదు మేరకు తక్షణమే దర్యాప్తు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు. ఈ మేరకు ఏసీబీ విజిలెన్స్ శాఖ మరియు రెవెన్యూ శాఖలు సమగ్ర దర్యాప్తు జరిపి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ