దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. రోజువారీ పాజిటివ్ కేసులు నమోదు తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా లాక్డౌన్ అమలుపై ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో ప్రస్తుతం అమలవుతున్న లాక్డౌన్ ను మరో వారంరోజుల పాటు అనగా మే 31, ఉదయం 5 గంటల వరకు పొడిగిస్తున్నట్టు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం నాడు ప్రకటించారు. ఢిల్లీలో ముందుగా ఏప్రిల్ 19 నుంచి లాక్డౌన్ అమలుచేయడం ప్రారంభించారు. అనంతరం పలుసార్లు లాక్డౌన్ ను పొడిగించగా, మే 31 వరకు లాక్డౌన్ అమల్లో ఉంటుందని తాజాగా సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు.
రోజువారీగా నమోదయ్యే కరోనా కేసులు సంఖ్యను బట్టి మే 31 నుంచి అన్లాక్ ప్రక్రియను ప్రారంభిస్తామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. మరోవైపు ఢిల్లీలో ఇప్పటివరకు మొత్తం 14,16,868 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 13,66,056 మంది కరోనా నుంచి కోలుకోగా, 23,202 మంది మరణించారు. ప్రస్తుతం 27,610 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ