ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. కొత్తగా 18767 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మే 23, ఆదివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 15,80,827 కు చేరింది. కొత్తగా అత్యధికంగా తూర్పుగోదావరిలో 2887, చిత్తూరులో 2323, పశ్చిమగోదావరిలో 1972, అనంతపూర్ లో 1846, విశాఖపట్నంలో 1668, గుంటూరులో 1249, కర్నూల్ లో 1166, ప్రకాశంలో 1162, నెల్లూరులో 1045, శ్రీకాకుళంలో 971, కడపలో 883, విజయనగరంలో 821, కృష్ణాలో 774 కేసులు నమోదయ్యాయి.
గత 24 గంటల్లో మరో 20,109 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయినట్టు తెలిపారు. ఇక కరోనా వలన రాష్ట్రంలో మరో 104 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 10126 కి పెరిగింది. గత 24 గంటల్లో 91,629 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా, మొత్తం పరీక్షల సంఖ్య 1,86,17,387 కు చేరుకుంది.
ఏపీలో కరోనా కేసులు వివరాలు (మే 23, ఉదయం 10 గంటల వరకు) :
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 15,80,827
- కొత్తగా నమోదైన కేసులు : 18,767
- కొత్తగా నమోదైన మరణాలు : 104
- డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 13,61,464
- యాక్టీవ్ కేసులు : 2,09,237
- మొత్తం మరణాల సంఖ్య : 10126
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ