తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 468 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జూన్ 30, గురువారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,00,944 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అలాగే కరోనా నుంచి మరో 246 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 7,92,190 కి చేరింది.
రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 98.91 శాతంగా, మరణాల రేటు 0.51 శాతంగా ఉంది. కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,643 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో హైదరాబాద్ లో 253, రంగారెడ్డిలో 47, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 39, సంగారెడ్డిలో 34, భద్రాద్రి కొత్తగూడెంలో 14, ములుగులో 12, నల్గొండలో 11, ఖమ్మంలో 10, మంచిర్యాలలో 9, మహబూబ్ నగర్ లో 5, హనుమకొండలో 4, సిద్దిపేటలో 4, నిజామాబాదులో 4, మహబూబాబాద్ లో 3, మెదక్ లో 3, వనపర్తిలో 3, సూర్యాపేటలో 3, యాదాద్రి భువనగిరిలో 2, పెద్దపల్లిలో 2, కరీంనగర్ లో 2, ఆదిలాబాద్ లో 2, జనగామలో 1, నారాయణ్ పేట్ లో 1 నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY