దేశంలో ఓవైపు పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నప్పటికీ, కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా రికవరీల పరంగా అమెరికాను అధిగమించి భారత్ అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రికవరీలలో 18.83 శాతంతో భారత్ మొదటి స్థానంలో ఉండగా, 18.77 శాతంతో అమెరికా, 16.96 శాతంతో బ్రెజిల్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
సెప్టెంబర్ 19, శనివారం ఉదయానికి దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 42 లక్షలు దాటింది. ఒకే రోజులో రికార్డ్ స్థాయిలో 95,880 మంది కరోనా బాధితులు కోలుకోవడంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య 42,08,431 కు చేరుకోగా, కరోనా రికవరీ రేటు 79.3 శాతంగా నమోదైంది. కొత్తగా కోలుకున్న95,880 మందిలో 90% మంది 16 రాష్ట్రాలు/కేంద్రప్రాంతాల నుండి నివేదించబడినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu