తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు, ఒక్కరోజే 891 నమోదు

Telangana Covid-19 Updates, Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, COVID-19, telangana, Telangana Coronavirus, Telangana Coronavirus Cases, Telangana Coronavirus Deaths, Telangana Coronavirus New Cases, Telangana Coronavirus News, Telangana New Positive Cases, Total COVID 19 Cases

తెలంగాణలో ముఖ్యంగా జీహెఛ్ఎంసీ ఏరియాలో రోజురోజుకి వందల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 891 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జూన్ 24, బుధవారం నాటికీ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10444 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. మంగళవారం నాడు మొత్తం 4069 సాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. అలాగే కరోనా వలన మరో ఐదుగురు మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 225 కి పెరిగినట్టు తెలిపారు. ఇక కొత్తగా కోవిడ్ నుంచి కోలుకున్న 137 మందితో కలిపి డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 4361 కి చేరింది. ప్రస్తుతం 5858 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.

రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(891):

  • జీహెచ్‌ఎంసీ ఏరియా – 719
  • రంగారెడ్డి – 86
  • మేడ్చల్ – 55
  • భద్రాద్రి కొత్తగూడెం – 6
  • ఖమ్మం – 4
  • వరంగల్ రూరల్ – 3
  • వరంగల్ అర్బన్ – 3
  • సంగారెడ్డి – 2
  • కరీంనగర్ -2
  • నల్గొండ – 2
  • కామారెడ్డి – 1
  • సిద్ధిపేట – 1
  • సిరిసిల్ల – 1
  • గద్వాల్ – 1
  • పెద్దపల్లి – 1
  • సూర్యాపేట – 1
  • నిజామాబాద్ – 1
  • మహబూబాబాద్ – 1
  • ఆదిలాబాద్ – 1

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu