దేశంలో పెద్దస్థాయిలో వైఫై నెట్వర్క్ విస్తరణకు సంబంధించిన “పబ్లిక్ వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్(పీఎం-వాణి)” పథకానికి బుధవారం నాడు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా పబ్లిక్ డేటా ఆఫీసుల ద్వారా పబ్లిక్ వైఫై సర్వీస్ను అందించడం కోసం వైఫై నెట్వర్క్ ల ఏర్పాటుకు ఎలాంటి లైసెన్సు ఫీజు, రిజిస్ట్రేషన్లు ఉండవని పేర్కొన్నారు. కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయాన్నీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మీడియాకు వెల్లడించారు. బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సేవల విస్తరణను వేగవంతం చేసే ఉద్దేశంతో ఈ ప్రతిపాదనకు కేంద్రం అంగీకారం తెలిపినట్టు పేర్కొన్నారు. ముందుగా ఇందుకోసం దేశంలో కోటి పబ్లిక్ డేటా సెంటర్లను ఏర్పాటు చేయనునట్టు తెలిపారు. పబ్లిక్ డేటా ఆఫీస్ అగ్రిగేటర్ లు, యాప్ ప్రొవైడర్, సెంట్రల్ రిజిస్ట్రీ ద్వారా ఒక ప్రణాళికతో వినియోగదారులకు సేవలు అందించనున్నట్టు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ