ఆరుగురు యంగ్ క్రికెట‌ర్ల‌కు థార్ ఎస్‌యూవీ కార్లు, ఆనంద్ మ‌హీంద్ర గిఫ్ట్

Anand Mahindra Announces to Gift Thar SUVs to Six Team India Cricketers

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ ను భారత్ 2-1 తో గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ చారిత్రక విజయాన్ని సాధించిన టీమిండియాకు ఇంకా శుభాకాంక్షలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త, మ‌హేంద్ర సంస్థ చైర్మన్ ఆనంద్ మ‌హేంద్ర టీమిండియాలోని ఆరుగురు ఆటగాళ్లకు థార్ ఎస్‌యూవీ కార్ల‌ను బహుమతిగా ఇస్తున్న‌ట్లు ప్రకటించారు. ఈ సిరీస్ లో అరంగ్రేట్రం చేసి అద్భుతమైన ప్రదర్శన చేసిన మ‌హ‌మ్మ‌ద్ సిరాజ్‌, న‌ట‌రాజ‌న్‌, న‌వ‌దీప్ సైనీ, వాషింగ్ట‌న్ సుంద‌ర్, ‌శార్దూల్ ఠాకూర్‌, శుభ్‌మ‌న్ గిల్‌ లకు మ‌హేంద్ర ఎస్‌యూవీలను‌ అందజేస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఆనంద్ మహేంద్ర ట్వీట్ చేశారు.

కలలు కనడం, అసాధ్యాన్ని సాధ్యం చేసుకోవడం ఎలాగో దేశంలోని భవిష్యత్ తరాల యువతకు ఈ ఆటగాళ్లు ఆద‌ర్శంగా నిలిచార‌ని చెప్పారు. వారివి నిజమైన ప్రేరణ కథలని పేర్కొన్నారు. అసమానతలను అధిగమించి వారు సాధించిన విజయం, అన్ని రంగాల వారి జీవితాల్లో ప్రేరణగా నిలుస్తుందన్నారు. అరంగ్రేట్రంలోనే గొప్ప ప్రదర్శన చేసిన ఈ ఆరుగురు ఆటగాళ్లకు కంపెనీకి ఎటువంటి ఖర్చు లేకుండా, స్వంత ఖర్చుతో ఆల్ న్యూ థార్ ఎస్‌యూవీని బహుమతిగా ఇవ్వడం తనకు వ్యక్తిగతంగా ఎంతో ఆనందాన్ని ఇస్తుందని ఆనంద్ మహేంద్ర పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + 14 =