తమిళనాడు రాష్ట్రంలో రోజురోజుకి కోవిడ్-19 (కరోనా వైరస్) మరింతగా విజృంభిస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో 1755 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, ఈ వైరస్ వలన 22 మంది మరణించారు. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా తమిళనాడు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చెన్నై, కోయంబత్తూర్ మరియు మదురై మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 26.4.2020 ఉదయం 6 గంటల నుండి 29.4.2020 రాత్రి 9 గంటల వరకు పూర్తిస్థాయిలో లాక్డౌన్ విధించనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి వెల్లడించారు.
అలాగే సేలం, తిరుపూర్ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 26.4.2020 ఉదయం 6 గంటల నుండి 28.4.2020 రాత్రి 9 గంటల వరకు పూర్తిస్థాయిలో లాక్డౌన్ విధించనున్నట్లు తెలిపారు. ఈ సమయంలో కంటైన్మెంట్ జోన్లను కఠినంగా నియంత్రించడంతో పాటుగా, ఈ ప్రాంతాల్లో క్రిమిసంహారక ద్రావణాన్ని రోజుకు రెండుసార్లు పిచికారీ చేస్తారని చెప్పారు. లాక్డౌన్ సమయంలో ఆసుపత్రులు, మందుల దుకాణాలు, అత్యవసర సేవలు, అమ్మ క్యాంటీన్లు, ఏటీఎంలు మాత్రమే తెరిచి ఉంటాయని తెలిపారు. ఎవరైనా పూర్తిస్థాయి లాక్డౌన్ సమయంలో రోడ్లపైకి వస్తే చర్యలు తీసుకోవడంతో పాటుగా వారి వాహనాలను సైతం స్వాధీనం చేసుకుంటామని సీఎం పళనిస్వామి ప్రకటించారు.
சென்னை, கோவை, மதுரை ஆகிய 3 மாநகராட்சிகளிலும் ஊரடங்கு முழுமையாக 26.4.2020 காலை 6 மணி முதல் 29.4.2020 இரவு 9 மணி வரை அமல் படுத்தப்படும்.
சேலம், திருப்பூர் மாநகராட்சிகளில் ஊரடங்கு முழுமையாக 26.4.2020 காலை 6 மணி முதல் 28.4.2020 இரவு 9 மணி வரை அமல் படுத்தப்படும். #TNLockdown
— Edappadi K Palaniswami (@CMOTamilNadu) April 24, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu