కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. దేశంలో రోజువారీగా అత్యధిక కేసులు కేరళలోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 33538 కరోనా కేసులు, 22 మరణాలు నమోదవడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 62,44,654 కు చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 57,740 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 46,813 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 58,33,762 కు చేరుకుంది.
రాష్ట్రంలో ప్రస్తుతం 3,52,399 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక ఎర్నాకులం జిల్లాలో అత్యధికంగా 64168 యాక్టీవ్ కేసులు ఉండగా, తిరువనంతపురంలో 41626, త్రిస్సుర్ లో 41419, కొల్లంలో 31326, కొట్టాయంలో 30132, కోజికోడ్ లో 24597, మలప్పురంలో 21752, అలపుజాలో 20584, పాలక్కాడ్ లో 19449, ఇడుక్కిలో 17625, కన్నూర్ లో 12938, పతనంతిట్టలో 12106 కేసులు ఉన్నాయి. మరోవైపు శనివారం నాటికి కేరళలో 4,45,25,439 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ