మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతుంది. గతకొన్నిరోజులుగా ప్రజలు పెద్ద సంఖ్యలో కరోనా బారినపడుతున్నారు. ఆదివారం కూడా కొత్తగా 48,401 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 51,01,737 కి చేరింది. కరోనాకు చికిత్స పొందుతూ మరో 572 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 75,849 కు పెరిగింది. అదేవిధంగా కొత్తగా 60,226 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 44,07,818 కు చేరింది. ప్రస్తుతం మహారాష్ట్రలో 6,15,783 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.
మహారాష్ట్రలో కరోనా కేసుల వివరాలు (మే 9, ఆదివారం నాటికీ):
- రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య : 2,94,38,797
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య – 51,01,737
- డిశ్చార్జ్ అయినవారి సంఖ్య – 44,07,818
- కరోనా రికవరీ రేటు – 86.4%
- యాక్టీవ్ కేసులు – 6,15,783
- మే 9న నమోదైన కేసులు – 48,401
- మే 9న డిశ్చార్జ్ అయినవారు – 60,226
- మే 9న నమోదైన మరణాలు – 572
- మొత్తం మరణాల సంఖ్య – 75,849
- కరోనా మరణాలు రేటు – 1.49%
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ