దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతుంది. మే 9, ఆదివారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,22,96,414 కు, కరోనా మరణాల సంఖ్య 2,42,362 కు పెరిగినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా వ్యాప్తి నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. అలాగే దేశవ్యాప్తంగా రోజువారిగా 18 లక్షలకుపైగానే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు కరోనా పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఇప్పటికి మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఉత్తర్ ప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఛత్తీస్ గడ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదైన 10 రాష్ట్రాలు:
- మహారాష్ట్ర – 51,01,737
- కర్ణాటక – 19,34,378
- కేరళ – 19,02,629
- ఉత్తర్ ప్రదేశ్ – 15,03,490
- తమిళనాడు – 13,80,259
- ఢిల్లీ – 13,23,567
- ఆంధ్రప్రదేశ్ – 12,87,603
- పశ్చిమబెంగాల్ – 9,93,159
- ఛత్తీస్ గడ్ – 8,42,356
- రాజస్థాన్ – 7,56,707
దేశంలో కరోనా మరణాలు ఎక్కువగా నమోదైన 10 రాష్ట్రాలు:
- మహారాష్ట్ర – 75,849
- ఢిల్లీ – 19,344
- కర్ణాటక – 18,776
- తమిళనాడు – 15,648
- ఉత్తర్ ప్రదేశ్ – 15,464
- పశ్చిమబెంగాల్ – 12,327
- ఛత్తీస్ గడ్ – 10,381
- పంజాబ్ – 10,315
- ఆంధ్రప్రదేశ్ – 8,707
- గుజరాత్ – 8,394
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ