పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్.రంగసామికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. స్వల్ప లక్షణాలు ఉండడంతో పుదుచ్చేరిలోని ఇందిరాగాంధీ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో ఆయన కరోనా పరీక్షలు చేయించుకోగా ఫలితం పాజిటివ్ గా వచ్చింది. ప్రస్తుతం సీఎం రంగసామి ఆరోగ్యం స్థిరంగా ఉందని, చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు అధికారులు తెలిపారు. ముందుగా మే 7, శుక్రవారం నాడు పుదుచ్చేరి సీఎంగా రంగసామి ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. కాగా ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన మరికొందరు కూడా కరోనా బారినపడినట్టుగా తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ