మహారాష్ట్రలో నేడు కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన మంత్రివర్గ విస్తరణ జరిగింది. దక్షిణ ముంబైలోని రాజ్భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 18 మంది కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. శివసేన, బీజేపీ పార్టీల నుంచి చెరో తొమ్మిది మందిని కొత్త మంత్రులుగా ఎంపిక చేయడం విశేషం. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఈ 18 మంది ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణం చేయించారు.
ఇక శాఖల కేటాయింపు విషయంలో.. బీజేపీ నుంచి డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్కు హోంశాఖ దక్కనున్నట్లు తెలుస్తోంది. అయితే 35–65 ఫార్మూలా ప్రకారం ప్రస్తుత మినీ మంత్రివర్గ విస్తరణ జరిగినట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. కాగా ఉద్ధవ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురేసిన శివసేన నేత ఏక్నాథ్ షిండే, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులుగా జూన్ 30న ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.
ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గం మంత్రులు: అబ్దుల్ సత్తార్, దాదా భుసే, శంభురాజ్ దేశాయ్, సందీపాన్ భుమరే, ఉదయ్ సామంత్, తానాజీ సావంత్, దీపక్ కేసర్కర్, సంజయ్ రాథోడ్, గులాబ్రావ్ పాటిల్.
ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆధ్వర్యంలోని బీజేపీ మంత్రులు: అతుల్ సేవ్, చంద్రకాంత్ పాటిల్, గిరీష్ మహాజన్, సుధీర్ మునగంటివార్, సురేశ్ ఖడే, రాధాకృష్ణ విఖే పాటిల్, రవీంద్ర చవాన్, విజయ్ కుమార్ గవిత్, మంగళ్ ప్రభాత్ లోధా.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY