స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజ్భవన్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. ప్రపంచంలోని భారతీయులందరికీ మరియు రాష్ట్ర ప్రజలకు 76వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వతంత్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రాణత్యాగం చేసిన వారిని స్మరించుకుందామని సూచించారు. గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న గవర్నర్, ప్రపంచంలోనే మన రాజ్యాంగం అత్యుత్తమమైనదని, దీనిని రూపొందించిన దార్శనికులకు కూడా నివాళులు అర్పిస్తున్నానని ఆమె అన్నారు. స్వాతంత్య్ర సమరయోధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ పర్వదినాన ఆజాదీ కా అమృత్ మహోత్సవాల పేరుతో దేశమంతా వేడుకలు జరుపుకుంటున్నారని గుర్తుచేశారు. వలసపాలన నుంచి విముక్తి పొంది స్వాతంత్య్రం సాధించుకున్నామని తెలిపిన తమిళిసై ఇలాంటి సమయంలో మన జాతీయ జెండా పట్ల గౌరవాన్ని ప్రదర్శించడం మన కర్తవ్యమని పేర్కొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్భవన్ సిబ్బందికి గవర్నర్ మిఠాయిలు తినిపించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY