ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు క్రమంగా వేడెక్కుతున్నాయి. పార్టీల మధ్య పొత్తు అంశంతో పాటుగా పలువురు నాయకుల బహిరంగ వ్యాఖ్యలతో భిన్న పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయ పరిస్థితులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. “జర బద్రం” పేరుతో ప్రజలను, పార్టీ శ్రేణులను ఉద్దేశించినట్లుగా పెట్టిన ఈ ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
“అప్పటి వరకు మనల్ని తిట్టిన నాయకులు సడెన్ గా మనల్ని పొగడ్డం ప్రారంభిస్తారు. ఆ పొగడ్తలను చూసి ఆ నాయకుడు మారిపోయాడు, పరివర్తన చెందాడని మనం భావించి చప్పట్లు, ఆనందకరమైన ఎమోజీలు పెడితే ప్రత్యర్థుల లక్ష్యం నెరవేరినట్లే. అప్పటి వరకు తిట్టిన నాయకులు ఇప్పుడు ఎందుకు పొగుడుతున్నారని ఆలోచించాలి. పొగుడుతున్నాడు కదా అని ఆ నాయకుడిని హర్షాతిరేకాలతో ఆకాశానికి ఎత్తకండి. అది మైండ్ గేమ్ లో ఒక భాగమే అని గుర్తెరగండి” అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY