వైఎస్ఆర్‌ ఆసరా, సంపూర్ణ పోషణ, విద్యాకానుక పథకాలు సెప్టెంబర్ లో ప్రారంభం

Minister Perni Nani Press Conference on AP Cabinet Meeting Key Decisions

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన ఆగస్టు 19, బుధవారం నాడు వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ కేబినెట్‌ భేటీలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం ముగిసిన అనంతరం మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు.

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు:

  • వైఎస్ఆర్ ఆసరా పథకానికి కేబినెట్‌ ఆమోదం
  • సెప్టెంబర్‌ 11న వైఎస్ఆర్ ఆసరా పథకం ప్రారంభం, నాలుగేళ్లలో డ్వాక్రా మహిళలకు 27వేల కోట్లకుపైగా లబ్ధి
  • నూతన పారిశ్రామిక విధానానికి ఆమోదం, 2020 నుంచి 2023 వరకు ఈ విధానం అమలు
  • సెప్టెంబర్‌ 1న వైఎస్ఆర్‌ సంపూర్ణ పోషణ పథకం ప్రారంభం, రూ. 1863 కోట్లు కేటాయింపు
  • సెప్టెంబర్‌ 5న వైఎస్ఆర్ విద్యాకానుక పథకం ప్రారంభం, 43 లక్షలకు పైగా విద్యార్థులకు అందజేత
  • డిసెంబర్ 1 నుంచి రాష్ట్రంలో ఇంటింటికి నాణ్యమైన బియ్యం పంపిణీ, 9260 వాహనాలు వినియోగం
  • పంచాయతీరాజ్‌ శాఖలో 51 డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారుల పోస్టులకు కేబినెట్‌ ఆమోదం
  • వైఎస్ఆర్ కడప జిల్లాలో ఎలక్ట్రానికి పార్క్ ఏర్పాటు
  • ఏపీ‌ ఆక్వాకల్చర్ సీడ్ కంట్రోల్ యాక్ట్ ఏర్పాటు
  • అపెక్స్ కౌన్సిల్‌ భేటీపై చర్చ
  • గోదావరి జిల్లాల్లో వరద ముంపు ప్రాంతాలలో సహాయక చర్యలపై చర్చ

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu