తెలుగు రాష్ట్రాల్లో కరోనా స్వైర విహారం చేస్తోంది. ఎంతోమంది ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. తాను కరోనా బారిన పడినట్లు స్వయంగా చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం, తనకు స్వల్ప లక్షణాలున్నందున వైద్యుల సూచనల మేరకు హోంక్వారంటైన్లో ఉన్నట్లు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా చంద్రబాబు నాయుడు సూచించారు.
ప్రజలందరూ దీనిని సీరియస్ గా తీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని ఆయన కోరారు. చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని నిన్న లోకేష్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని, అయితే.. ముందు జాగ్రత్త చర్యగా కొవిడ్ తగ్గిపోయే వరకు హోం ఐసోలేషన్లో ఉండాలని నిర్ణయించుకున్నట్లు లోకేష్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ