డిసెంబర్ 15న తెలంగాణకు జేపీ నడ్డా, బండి సంజయ్ ఐదోవిడత ప్రజా సంగ్రామయాత్ర ముగింపు సభకు హాజరు

JP Nadda will Attend Bandi Sanjay's 5th Phase Praja Sangrama Yatra Concluding Meeting on December 15th,Telangana BJP President Bandi Sanjay Kumar,Telangana HC Green Signal For Praja Sangrama Yatra,Bandi Sanjay's 5th Praja Sangrama Yatra,Praja Sangrama Yatra from 28th,Bhainsa to Karimnagar,Mango News,Mango News Telugu,Praja Sangrama Yatra,BJP Telangana Chief Bandi Sanjay,BJP Chief Bandi Sanjay,Bandi Sanjay,Bandi Sanjay Kumar,Praja Sangrama Yatra Latest News and Updates,Praja Sangrama Yatra

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రస్తుతం రాష్ట్రంలో ఐదో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ చేపడుతున్న సంగతి తెలిసిందే. నేటితో ఐదో విడత పాదయాత్ర 15వ రోజుకు చేరుకోగా, డిసెంబర్ 15వ తేదీన కరీంనగర్ లో యాత్రను ముగించనున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 15 తేదీ మధ్యాహ్నం 1 గంటకు కరీంనగర్ లోని ఎస్.ఆర్.ఆర్ కాలేజీ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని తెలంగాణ బీజేపీ నిర్ణయించింది. ఈ పాదయాత్ర ముగింపు సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్టుగా ప్రకటించారు.

జేపీ నడ్డా హాజరు కానున్న నేపథ్యంలో ఈ సభను భారీగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయడంతో పాటుగా, జన సమీకరణ సహా ఇతర అంశాలపై రాష్ట్రస్థాయి బీజేపీ నేతలు ఇప్పటికే రంగంలోకి దిగారు. మునుగోడులో ఓటమి, ఐదో విడత పాదయాత్ర సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాల అనంతరం ఈ సభ జరుగుతుండడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని, విజయవంతంగా నిర్వహించడంపై బీజేపీ నేతలు దృష్టి సారించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE