దేశంలో మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల తర్వాత ఢిల్లీలో కరోనా తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో ఇప్పటికే 23,645 కరోనా కేసులు నమోదవగా, 9542 మంది కోలుకున్నారు, 615 మంది మరణించారు. ఈ క్రమంలో ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో వైద్య సిబ్బంది కూడా పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. ఎయిమ్స్లో ఇప్పటివరకు మొత్తం 480 సిబ్బంది వైరస్ బారిన పడ్డట్టుగా తెలుస్తుంది. వైద్య సిబ్బంది కరోనా బారిన పడడంతో పరిస్థితి ఆందోళన కల్గించే విధంగా ఉంది.
కరోనా సోకిన 480 మందిలో 19 మంది వైద్యులు, 38 మంది నర్సులు, 75 మంది ఆఫీస్ అటెండర్లు, 74 మంది సెక్యూరిటీ గార్డులు, 54 మంది శానిటేషన్ వర్కర్లు, 14 మంది లేబోరేటరీ టెక్నీషియన్లు కాగా మిగిలిన వారు ఇతర సిబ్బందిగా ఎయిమ్స్ వర్గాలు పేర్కొన్నాయి. అలానే ఇప్పటివరకు ముగ్గురు ఎయిమ్స్ సిబ్బంది కరోనా వలన మరణించినట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu