ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మరో 16 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించినట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఇందుకోసం రూ.16 వేల కోట్లు కేటాయించామని, వీటి నిర్మాణానికి ఆగస్టు నెలలో టెండర్లు పిలుస్తామని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో వైద్య వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారని, అందులో భాగంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునికీకరణ చేస్తున్నామన్నామని తెలిపారు. కాగా విజయనగరం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయబోయే ప్రభుత్వ వైద్య కళాశాల కోసం మంత్రి ఆళ్ల నాని ఈ రోజు స్థల పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి, రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu