ఎన్టీఆర్ జయంతి.. నివాళులర్పించిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్

NTR 103rd Birth Anniversary CM Chandrababu and Minister Nara Lokesh Pays Rich Tributes

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, నటసార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 103వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. ఈ మేరకు గురువారం ఉదయం తన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతా ద్వారా ఒక భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు.

“కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు.. మహా పురుషులవుతారు అనే మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన మహామనీషి అన్న ఎన్టీఆర్” అని ఆయన కొనియాడారు. 1923 మే 28న కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించిన ఆయన, తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన కారణజన్ముడని పేర్కొన్నారు. వెండితెరపై రాముడు, కృష్ణుడు వంటి దైవ పాత్రలలో చెరగని ముద్ర వేసి, రాజకీయ రంగంలో ధృవతారగా వెలిగిన ఆ యుగపురుషుడు.. తెలుగువారి జీవితాల్లో పెను మార్పులు తెచ్చిన ఆధునిక సంఘ సంస్కర్త అని సీఎం చంద్రబాబు శ్రద్ధాంజలి ఘటించారు.

మంత్రి నారా లోకేశ్ అంజలి

ఎన్టీఆర్ మనవడు, మంత్రి నారా లోకేశ్ సైతం ఎక్స్ వేదికగా..”ప్రపంచవ్యాప్తంగా తెలుగు జాతికి కీర్తిని తెచ్చిన ప్రపంచ ప్రఖ్యాత నటుడు-చక్రవర్తి నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా, ఆ మహనీయుని సేవలను స్మరించుకుంటూ నేను నా నివాళులు అర్పిస్తున్నాను. ఆయన తెలుగు ప్రజల ఆత్మగౌరవంతో తెలుగు దేశం పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. పసుపు జెండాను నాటి అణగారిన వర్గాలకు అండగా నిలిచారు. మహిళా సాధికారతకు బాటలు వేశారు. ప్రజల కోసం… ప్రగతి కోసం తెలుగు దేశం పార్టీని అంకితం చేశారు. ఆయన సంక్షేమానికి ప్రతీకగా నిలిచారు. “అన్నా అంటే నేను ఉన్నాను” అని చెబుతూ ప్రజలను ఆలింగనం చేసుకున్నారు. కోట్లాది మంది హృదయాల్లో కొలువుదీరిన అమర మహనీయుడు ఎన్టీఆర్‌కు వందనాలు. టాటా.. మీరు తెలుగు ప్రజల కీర్తి.. మీరు మాకు శాశ్వత స్ఫూర్తి..” అని పేర్కొన్నారు.

మూడు తరాలుగా చెరగని అదే గౌరవం: నారా భువనేశ్వరి

ఎన్టీఆర్ కుమార్తె నారా భువనేశ్వరి కూడా ‘ఎక్స్’ వేదికగా తన తండ్రి జ్ఞాపకాలను స్మరించుకుంటూ నివాళులు అర్పించారు. తాము మూడు తరాలుగా చూస్తున్నప్పటికీ, ఎన్టీఆర్ అంటే నేటి యువతరానికి కూడా అదే గౌరవం, అదే అభిమానం తగ్గకుండా ఉండటం విశేషమన్నారు. రాజకీయాలలో ఆయన ఏ విషయాన్నైతే ప్రజలకు చెప్పారో.. దాన్ని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆచరణలో చేసి చూపించారని గుర్తుచేశారు. ఆ అచంచలమైన నిబద్ధతే ఆయనను తెలుగువారందరికీ ‘అన్నగారిగా’ మార్చిందని ఆమె భావోద్వేగానికి లోనయ్యారు.

ఎన్టీఆర్ ఘాట్ వద్ద ప్రముఖుల అంజలి.. మరణం లేని జననం

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద గురువారం ఉదయం నుంచే నివాళులర్పించేందుకు ప్రముఖులు, అభిమానులు పోటెత్తారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి దంపతులతో పాటు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, వైకాపా నేత లక్ష్మీపార్వతి తదితరులు సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి అంజలి ఘటించారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పురందేశ్వరి మాట్లాడుతూ.. తెలుగువారు ప్రపంచంలో ఎక్కడున్నా అందరిపై ఎన్టీఆర్ ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. రాజకీయాలంటే కేవలం అధికారం కాదు.. అది నిఖార్సైన ప్రజాసేవ అని నిరూపించిన మహానాయకుడు ఆయనేనని స్పష్టం చేశారు. ఎన్టీఆర్‌ది భౌతికంగా మరణం లేని జననమని, ఆయన తెలుగువారి ఆత్మగౌరవానికి నిత్య ప్రతీక అని కొనియాడారు. తమ కుటుంబంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరిపై ఆయన దీవెనలు ఉండాలని ఆకాంక్షించారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని రెండు రాష్ట్రాల్లోని అభిమానులు, టీడీపీ శ్రేణులు విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here