కొత్తగా ఏర్పడిన మెడికల్ కళాశాలలలో మౌలిక సదుపాయాలు మెరుగు పరచాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో జూన్ 8, సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ లోని బిఆర్కే భవన్ లో సూర్యపేట, నల్గొండ మెడికల్ కళాశాలలపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి లు సమీక్షా సమావేశం నిర్వహించారు. మొదటి సంవత్సరం పూర్తిచేసుకుని రెండో సంవత్సరంలో అడుగిడుతున్న నేపథ్యంలో వైద్య విద్యార్థులకు కావలసిన వసతులు, సిబ్బంది నియామకం, కళాశాలల నిర్మాణాలపై సుదీర్ఘంగా సమీక్షించారు.
రెండు కళాశాలలో రెండో సంవత్సరం ప్రారంభమౌతున్నందున సిబ్బంది కొరతను మంత్రుల దృష్టికి తీసుకురాగా పాలనా పరమైన అనుమతులు తీసుకొని త్వరితగతిన నియామకాలు పూర్తి చేయాలని ఆదేశించారు. అదే విదంగా ప్రభుత్వ ఆసుపత్రిలలో మార్చురీలు ఆధునీకరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రులు ఈటల,జగదీష్ రెడ్డి లు సూచించారు. ఈ సమావేశంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేష్ రెడ్డి, టియస్ఎంయస్ఐడిసి ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, సిఇ లక్ష్మారెడ్డి లతో పాటు నల్గొండ, సూర్యపేట మెడికల్ కళాశాలల ప్రిన్సిపాల్స్, సూపరింటెండెంట్స్, తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu