కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత జట్టు ప్రదర్శనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. మొత్తం 39 పతకాలతో భారత్ టోర్నీని విజయవంతంగా ముగించడం దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. క్రీడాకారులు చూపిన అంకితభావం, క్రమశిక్షణ, పోరాట స్ఫూర్తి భారత క్రీడా సామర్థ్యాన్ని ప్రపంచానికి మరోసారి చాటిచెప్పిందన్నారు.
39 Medals. One Tricolour. Countless Dreams.
The Commonwealth Games 2026 conclude with India securing an impressive tally of 39 medals, a remarkable achievement that reflects the unwavering determination, discipline and fighting spirit of our athletes.
Every medal earned is the… pic.twitter.com/vjMVApDtzD
— Pawan Kalyan (@PawanKalyan) August 3, 2026
ప్రతి పతకం వెనుక ఎన్నో ఏళ్ల శ్రమ
భారత అథ్లెట్లు సాధించిన ప్రతి పతకం వెనుక ఎన్నో సంవత్సరాల కఠోర సాధన, త్యాగం, క్రమశిక్షణ దాగి ఉందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. దేశం కోసం విజయం సాధించాలనే లక్ష్యంతో వారు చేసిన అవిశ్రాంత కృషికి ఈ పతకాలే నిదర్శనమన్నారు.
కోచ్లు, కుటుంబాల పాత్ర మరువలేనిది
క్రీడాకారుల విజయాల్లో కోచ్లు, కుటుంబ సభ్యులు, సహాయక సిబ్బంది కీలక పాత్ర పోషించారని పవన్ కల్యాణ్ అన్నారు. వారి నిరంతర ప్రోత్సాహం, అంకితభావం వల్లే క్రీడాకారులు అంతర్జాతీయ వేదికపై అత్యుత్తమ ప్రదర్శన కనబరచగలిగారని కొనియాడారు.
టీమ్ ఇండియా పోరాట స్ఫూర్తికి ప్రశంసలు
టోర్నీ ప్రారంభం నుంచి చివరి ఈవెంట్ వరకు భారత క్రీడాకారులు అసాధారణ పోరాట పటిమ, క్రీడాస్ఫూర్తి, నైపుణ్యాన్ని ప్రదర్శించారని ఆయన అన్నారు. ప్రతి పోటీలో దేశ గౌరవాన్ని నిలబెట్టేందుకు క్రీడాకారులు శక్తివంచన లేకుండా పోరాడారని పేర్కొన్నారు.
త్రివర్ణ పతాకానికి గౌరవం తీసుకొచ్చారు
అంతర్జాతీయ వేదికపై భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన ప్రతి అథ్లెట్ దేశంలోని 140 కోట్ల మంది భారతీయుల ఆశలు, ఆకాంక్షలకు ప్రతినిధిగా నిలిచారని పవన్ కల్యాణ్ తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి విజయాలతో భారత క్రీడా రంగం మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.





































