దేశంలో మహారాష్ట్ర తర్వాత ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. అదికూడా చెన్నై నగరంలో ప్రతిరోజూ భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో శనివారం నాడు కొత్తగా 1989 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క చెన్నై నగరంలోనే 1506 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 42,687 కి చేరింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో ఒక్క చెన్నైలోనే 30444 కేసులు నిర్ధారణ అయ్యాయి. గత 24 గంటల్లో నమోదైన 30 కరోనా మరణాలతో కలిపి ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 397 కి చేరింది. ఇక కొత్తగా కోవిడ్ నుంచి కోలుకున్న 1362 మందితో కలిపి డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 23409 కి చేరింది. ప్రస్తుతం 18878 మంది వివిధ ఆసుపత్రుల్లో కరోనాకు చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu