దేశంలో కరోనా వాక్సిన్ పంపిణీకి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో రేపు (జనవరి 11, సోమవారం) అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ కానున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం జరగనుంది. కొవాక్సీన్, కోవిషిల్డ్ వాక్సిన్ ల అత్యవసర వినియోగానికి డ్రగ్స్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా (డీసీఐజీ) ఇటీవలే అనుమతులు మంజూరు చేసింది. దేశవ్యాప్తంగా ఇప్పటికే రెండువిడతలుగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ డ్రైరన్ (మాక్ డ్రిల్) కూడా నిర్వహించారు. జనవరి 16, శనివారం నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమవుతుందని కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ఏర్పాట్లు, కోల్డ్ స్టోరేజీల ఏర్పాటు సహా పలు అంశాలపై సీఎంలతో ప్రధాని మోదీ చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ