తెలుగులో జానపద గీతాలకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు ఇదే వరుసలో అమూల్య స్టూడియో తన కొత్త జానపద గీతం “రంగు రంగుల పిల్లగాడో” ప్రేక్షకులను అలరించడానికి తీసుకువచ్చింది.
ఈ పాటను రెలారే రోజా రమణి తన అద్భుతమైన గొంతుతో ఆలపించారు. ఉషనమ్మ ఈ పాట రచనతో తన ప్రతిభను చాటుకోగా, గజ్వేల్ వేణు అందించిన సంగీతం పాట ఊపును మరింత పెంచింది. నీరజ్ కీస్ కీబోర్డ్ & ప్రోగ్రామింగ్ అందించారు. అజిత్ పాషం కెమెరా అండ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఫోక్ సాంగ్స్ ఇష్టపడేవారు తప్పకుండా వినాల్సిన పాట ఇది.






































