దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో కరోనా వాక్సిన్ పంపిణీ విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారిపై చేస్తున్న పోరాటంలో భాగంగా ఇప్పటికే 10 లక్షల మందికి పైగా కరోనా వ్యాక్సిన్ వేసి భారత్ ఒక ముఖ్యమైన మైలురాయిని దాటింది. జనవరి 22, శుక్రవారం ఉదయం 7 గంటల వరకు దేశవ్యాప్తంగా 10,43,534 మంది హెల్త్కేర్ వర్కర్లకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.
కేవలం గత 24 గంటల్లో మొత్తం 4,049 కేంద్రాల్లో 2,37,050 మందికి వ్యాక్సిన్ వేసినట్టు పేర్కొన్నారు. మరోవైపు అన్ని రాష్ట్రాల్లో కలిపి ఇప్పటివరకు 18,167 సెషన్లు నిర్వహించినట్టు తెలిపారు. అత్యధికంగా కర్ణాటకలో(1,38,807), ఆంధ్రప్రదేశ్ లో (1,15,365), ఒడిశాలో (1,13,623), తెలంగాణలో (97,087) లబ్దిదారులకు కరోనా వ్యాక్సిన్ వేసినట్టు కేంద్రం తెలిపింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ