అయోధ్య రామమందిరం నిర్మాణానికి జనసేన పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ రూ.30 లక్షలు విరాళంగా ఇచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం తిరుపతిలో రాష్ట్ర ఆర్ఎస్ఎస్ ముఖ్యనేత భరత్ కు రూ.30 లక్షలకు సంబందించిన చెక్కును అందించారు. అలాగే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సిబ్బంది కూడా రూ.11000 విరాళంగా ఇచ్చారు. ఆ చెక్కును కూడా భరత్ కు పవన్ కళ్యాణ్ అందించారు. ధర్మానికి ప్రతిరూపమైన శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో రామమందిర నిర్మాణానికి విరాళం అందించడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు డాక్టర్ కామినేని శ్రీనివాస్, పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ