ఒకేరోజులో 3611 కరోనా కేసులు, 38 మరణాలు నమోదు

Maharashtra Reports 3611 New Covid-19 Cases and 38 Deaths in Last 24 hours

మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. ఫిబ్రవరి 13, శనివారం నాడు 3611 కరోనా కేసులు, 38 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,60,186 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 51489 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 1,773 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 19,74,248 కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 95.83 శాతంగా ఉండగా, మరణాల రేటు 2.5 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 33,269 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. శనివారం నాటికి మహారాష్ట్రలో 1,52,72,826 కరోనా పరీక్షలు నిర్వహించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ