దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 9121 కరోనా కేసులు, 81 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,09,25,710 కు, మరణాల సంఖ్య 1,55,813 కు చేరుకుంది. దేశంలో హోమ్ ఐసొలేషన్స్ మరియు ఆసుపత్రుల్లో 1,36,872 (1.25%) మంది బాధితులు కరోనాకు చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో 17 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎటువంటి కరోనా మరణాలు సంభవించలేదు. అలాగే సిక్కిం, మేఘాలయ, అండమాన్ అండ్ నికోబార్, నాగాలాండ్, త్రిపుర, దాద్రా మరియు నగర్ హవేలి మరియు డామన్ మరియు డయ్యు వంటి 6 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కొత్త కరోనా కేసులు నమోదు కాలేదు.
మరోవైపు కొత్తగా 11,805 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 1,06,33,025 కు చేరుకోగా, కరోనా రికవరీ రేటు 97.32 శాతంగా నమోదైంది. కరోనా మరణాల రేటు 1.43 శాతంగా ఉంది. ఫిబ్రవరి 15 నాటికీ దేశవ్యాప్తంగా 20,73,32,298 కరోనా పరీక్షలు నిర్వహించగా, గత 24 గంటల్లో 6,15,664 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులలో అత్యధికంగా మహారాష్ట్రలో 3365, కేరళలో 2884, తమిళనాడులో 455, కర్ణాటకలో 368, ఛత్తీస్ గడ్ లో 274 కేసులు నివేదించబడ్డాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ