ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 13 జిల్లాల్లోని 2786 పంచాయతీలకు, 20,817 వార్డులకు పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 81.67% పోలింగ్ నమోదయినట్టు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని, అలాగే ఎక్కడా రీ-పోలింగ్ నిర్వహించాల్సిన పరిస్థితులు లేవని ప్రకటించారు. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 86.60 శాతం పోలింగ్ నమోదు కాగా, శ్రీకాకుళం జిల్లాలో అత్యల్పంగా 72.87 శాతం పోలింగ్ నమోదైంది. మరోవైపు సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు పక్రియ కొనసాగుతుంది. ఫలితాలు వెలువడిన గ్రామాల్లో ఉప సర్పంచ్ ఎన్నిక కూడా నిర్వహిస్తున్నారు.
జిల్లాలవారీగా పోలింగ్ శాతం వివరాలు:
- తూర్పుగోదావరి: 82.86
- పశ్చిమగోదావరి: 81.75
- కృష్ణా: 84.12
- గుంటూరు: 85.51
- ప్రకాశం: 86.60
- నెల్లూరు: 78.04
- శ్రీకాకుళం: 72.87
- విశాఖపట్నం: 84.94
- చిత్తూరు జిల్లా: 77.20
- అనంతపురం: 84.65
- కడప: 80.47
- కర్నూలు: 80.76
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ